
నారాయణపేట
ఇసుక తరలుతుంటే ఏం చేస్తున్నారు?
గురువారం శ్రీ 29 శ్రీ మే శ్రీ 2025
వివరాలు 8లో u
నారాయణపేట: మక్తల్లో రాత్రి వేళల్లో ఇసుక అక్రమంగా తరలిస్తుంటే గనులశాఖ అధికారులు ఏం చేస్తున్నారని, వెంటనే తగు చర్యలు చేపట్టాలని ఎంపీ డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి, సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) రెండో సమావేశానికి ఎంపీ అధ్యక్షత వహించారు. 46 ప్రభుత్వ శాఖల పరిధిలో కేంద్ర, రాష్ట్ర నిధులతో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై జిల్లా అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. మక్తల్ పట్టణంలోని ట్యాంక్బండ్పై హోటల్, టాయిలెట్ బ్లాక్, ఇతర దుకాణాల నిర్మాణానికి ప్రతిపాదించడంపై మున్సిపల్ కమిషనర్పై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న చెరువుకట్టపై ఎవరైనా దుకాణాలు, హోటళ్లు నిర్మిస్తారా? అసలు ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు ప్రతిపాదించినా అది సాధ్యం కాదని నిర్మోహమాటంగా చెప్పాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులందరికి ఆయా పథకాలను లబ్ధి చేకూర్చాలనిఅన్నారు. పథకాల్లో లోటుపాట్లు సరిచేసి పూర్తిస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా పరిష్కరించడం జరుగుతుందన్నారు. జిల్లాలో వేరుశనగ దిగుబడిని, నూనె గింజల ఉత్పత్తిని పెంచేందుకు కృషి చేయాలని ఎంపీ సూచించారు.
క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకునేలా అవగాహన
కేంద్ర ప్రభుత్వం మహిహిళా ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతూ క్యాన్సర్ స్క్రీనింగ్లను ఆశా, ఏఎన్ఎంలు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలకు అవగాహన కల్పించి చేసుకునేలా చూడాలని ఎంపీ సూచించారు. డీఎంహెచ్ఓ జయచంద్రమోహన్ వైద్య శాఖనివేదికలో ఎఎన్సీ, ఇమ్యూనైజేషన్, ఫ్యామిటీ ప్లానింగ్ స్టేరిలైజేషన్, ప్రసవాల టార్గెట్లు, అచివ్మెంట్లపై తెలిపారు. డీఎల్పీఓ సుధాకర్రెడ్డి 15వ ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నిధుల వివరాలు, డీఏఓ జాన్సుధాకర్ పీఎం కిసాన్ కింద అందిన సాయం, సబ్సిడీపై రైతులకు పంపిణీ చేసిన ఎరువుల వివరాలు, డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడ్రనైజేషన్ కార్యక్రమ అమలు పై అధికారి శ్రీధర్ తెలిపారు. డీఆర్డీఏ మొగులప్ప, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఈ నెల 22 వరకు 5.15 లక్షల పనిదినాలు కల్పించినట్లు వివరించారు. అస్పిరేషన్ బ్లాక్ నర్వ మండలంలో ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, సామాజిక రంగాలకు సంబంధించిన ఐదు అంశాలలో కీలక పనితీరు సూచికల పనితీరు ఆధారంగా నీతి అయోగ్ డిసెంబర్ త్రైమాసిక డెల్టా ర్యాంకింగ్ను విడుదల చేసిందని, పనితీరు ఆధారంగా నర్వ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకును సాధించిందని అధికారులు వివరించారు. పీఎంశ్రీ కింద పాఠశాలల ఎంపికపై డీఈఓ గోవిందరాజులు మాట్లాడుతూ.. పీఎంశ్రీ కింద జిల్లాలో మొదటి దశలో 12, రెండో దశలో 7 పాఠశాలలు ఎంపికయ్యాని, మూడో విడతో 20 పాఠశాలలకు ప్రతిపాదనలు పంపించామన్నారు. దీంతో రెండో దశలో ఎందుకు తగ్గిందని ఎంపీ ఆరా తీశారు. అనంతరం ఎస్సీ వెల్ఫేర్, మిషన్ భగీరథ, జిల్లాపౌరసరఫరాల శాఖ, జీఎండీఐసీ, నాబార్డు, పశుసంవర్ధకశాఖతో తదితర వాటిపై నివేదికలు చదివి వినిపించారు. సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, డీఎఫ్ఓ అరవింద్, ఆర్డీఓ రాంచంద్రనాయక్, జెడ్పీసీఈఓ శైలేష్కుమార్, దిశ కమిటీ సభ్యులు లక్ష్మి, పాండునాయక్, కిరణ్, పగడాకులు శ్రీనివాస్, బలరాంరెడ్డి పాల్గొన్నారు.
మక్తల్లో ట్యాంక్బండ్పై దుకాణాలనిర్మాణానికి ప్రతిపాదించడంపై ఆగ్రహం
అభివృద్ధి, సంక్షేమ పథకాలపై విస్తృతఅవగాహన కల్పించాలి
జిల్లా అధికారులకు ఎంపీ డీకే అరుణ దిశా నిర్దేశం