భరోసా కొందరికే..! | - | Sakshi
Sakshi News home page

భరోసా కొందరికే..!

May 22 2025 12:35 AM | Updated on May 22 2025 12:35 AM

భరోసా

భరోసా కొందరికే..!

కోస్గి: రైతులకు వ్యవసాయ పెట్టుబడి కోసం రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతు భరోసా పథకం కొందరికే భరోసా ఇవ్వడంతో అర్హతలుండి సాయం అందని రైతులకు నేటికి ఎదురుచూపులు తప్పడం లేదు. వానాకాలం సీజన్‌ సైతం వస్తున్నా నేటికీ 40 శాతం మంది రైతులకు రైతు భరోసా అందకపోవడంతో తీవ్ర నిరాశలో ఉన్నారు. అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రెండు విడతల్లో రూ.12వేల చొప్పున రైతు భరోసా సొమ్ము నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం పూర్తిస్థాయిలో అందించలేకపోతుంది.

రూ.93 కోట్లు పెండింగ్‌..

జిల్లాలో 13 మండలాల పరిధిలోని 4.59 లక్షల ఎకరాల సాగు భూముల్లో ఇప్పటి వరకు కేవలం 60 శాతం భూములకు మాత్రమే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో 40 శాతం భూములకు సంబందించి నేటికి డబ్బులు పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలో 1.75 లక్షల మంది రైతులు అర్హులుగా ఉండగా వారిలో ఇప్పటి వరకు 1.42 లక్షల మందికి మాత్రమే రైతు భరోసా అందింది. ఇంకా 33000 మంది రైతులకు రూ.93 కోట్లు అందాల్సి ఉంది.

రైతుల అయోమయం

రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు గత ప్రభుత్వం రైతుబంధు పేరుతో ఈ పథకాన్ని అమలు చేయగా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చి అమలు చేస్తుంది. గతంలో పంటల సాగుకు ముందే సాయం అందేది. ప్రస్తుతం పంటలు ఇంటికి వచ్చాక సాయం అందిస్తున్నారు. గత సీజన్‌కు సంబందించిన నిధులు పూర్తిస్థాయిలో అందక పోగా వానాకాలం సీజన్‌ పనులు సైతం ప్రారంభ దశలో ఉన్నాయి. కొందరు రైతులు తమ పొలాలను దుక్కులు చేసుకొని వానాకాలం పంటలకు సిద్ధం చేస్తున్నారు. గత సీజన్‌కు సంబంధించిన రైతు భరోసా నేటికి అందకపోవడంతోపాటు వానాకాలం సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతు భరోసా పథకం అమలు తీరుపై రైతులు సర్వత్రా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై న ప్రభుత్వం వెంటనే గత సీజన్‌కు సంబందించిన డబ్బులు రైతులకు అందించడంతోపాటు వానాకాలం సీజన్‌లోనైన పంటల సాగుకు ముందే పెట్టుబడి సాయంగా రైతు భరోసా డబ్బులు అందించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

మొత్తం భూములవిస్తీర్ణం (ఎకరాల్లో)

4.59 లక్షలు

మిగిలిన రైతులు

33,000 మంది

రూ. 240.42 కోట్లు

జిల్లా వివరాలిలా..

నేటికి పూర్తికాని రైతు భరోసా పంపిణీ

పథకం ప్రారంభించి నెలలు గడుస్తున్నా పూర్తికాని ప్రక్రియ

4 ఎకరాల వరకు ఉన్న రైతులకే అందిన సాయం

33 వేల మందికి తప్పని ఎదురుచూపులు

ఇప్పటివరకు పంపిణీ చేసింది

రూ. 147.41 కోట్లు

భరోసా కొందరికే..! 1
1/4

భరోసా కొందరికే..!

భరోసా కొందరికే..! 2
2/4

భరోసా కొందరికే..!

భరోసా కొందరికే..! 3
3/4

భరోసా కొందరికే..!

భరోసా కొందరికే..! 4
4/4

భరోసా కొందరికే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement