
కార్మిక వ్యతిరేక కోడ్లను రద్దు చేయాలి
నారాయణపేట: సామాన్యులపై భారం మోపి సంపన్నులకు వరాలు ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజావ్యతిరేక విధానాలు నిరసిస్తూ మే 20న జాతీయ సమ్మె నిర్వహిస్తున్నట్లు సిఐటీయు జిల్లా కార్యదర్శి బాల్రామ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన విలేకరుల నమావేశంలో ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం పూర్వం నుంచి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను సవరించి, కొన్నింటిని రద్దుచేసి యాజమానులకు అనుకూలంగా తీసుకువస్తున్న నాలుగు కార్మిక కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సమ్మెను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ సంపదను బడ కార్పోరేట్ శక్తులకు కారు చౌకగా ఆమ్మేస్తున్న విధానాన్ని నిరసిస్తూ సమ్మె జరుగనుందన్నారు. 45వ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసుల మేరకు కనీస వేతనం రూ.26 వేలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయాలని, అంగన్వాడి, ఆశ, మధ్యాహ్నభోజన కార్మికులు, క్షేత్ర సమయకులు, విఓఏలు, ఆర్పిలు తదితర స్కీమ్ వర్కర్లందర్నీ కార్మికులుగా గుర్తించాలని కార్మిచట్టాలను వర్తింప చేయాలన్నారు. ఈ సమావేశంలో సిఐటియు నాయకులు నరహరి, కార్మిక సంఘాల నాయకులు వెంకటేశ్, కాశప్ప, నరసింహ, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.