నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు | - | Sakshi
Sakshi News home page

నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు

May 7 2025 12:26 AM | Updated on May 7 2025 12:26 AM

నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు

నష్టం అంచనాకు సాంకేతిక సమస్యలు

మ్మడి జిల్లావ్యాప్తంగా 68,765 ఎకరాల్లో మామిడి తోటలు సాగు అవుతున్నాయి. వీటిలో కొల్లాపూర్‌ నియోజకవర్గ పరిధిలోనే అత్యధికంగా 25 వేల ఎకరాలకు పైగా తోటలు ఉన్నాయి. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతగా ఈసారి పంట నష్టం జరిగింది. ఈదురుగాలులు, వర్షాల కారణంగా కల్వకుర్తి, బిజినేపల్లి మండలాల్లో భారీగా చెట్లు నెలకొరిగాయి. ఈ రెండు ప్రాంతాల్లో 82 మంది రైతులకు సంబంధించి 272 ఎకరాల్లో చెట్లు నేలకొరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఇతర ప్రాంతాల్లో జరిగిన పంట నష్టాలపై సమాచారం సేకరించలేదు. వాస్తవంగా పంట నష్టం భారీస్థాయిలో జరిగింది. కానీ, మామిడి పంటనష్టం అంచనా వేసేటప్పుడు అధికారులు నేలరాలిన కాయలను పరిగణలోకి తీసుకోరు. చెట్లు నెలకొరిగితేనే లెక్కలోకి తీసుకుంటారు. ఈ రకమైన సాంకేతిక సమస్యల కారణంగా మామిడి పంటనష్టంపై పూర్తిస్థాయి నివేదిక అధికారులు రూపొందించలేకపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement