
చివరి గింజ వరకు కొంటాం..
జిల్లాలోని రైతుల వద్ద ఉన్న వరి ధాన్యాన్ని చివరి గింజ వరకు కొనుగోలుచేస్తాం. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. అకాల వర్షాలు వస్తుండడంతో అప్రమత్తంగా ఉంటూ ధాన్యం వర్షానికి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సన్నాలకు రూ. 500 బోనాస్ వస్తుంది.
– సైదులు, సివిల్ సప్లయ్ డీఎం
రైతులంటే అలుసా..
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఎన్నో కష్టాలకు ఓర్చి మిల్లుకు తీసుకువస్తే ధాన్యం దించుకోలేమంటున్నారు. రైతులు పడే కష్టాలు అధికారులకు ఎలా తెలుస్తాయి. మిల్లుల దగ్గర రోజుల తరబడి ఉంటే ఆర్థమవుతుంది. తాము తెచ్చిన ధాన్యం బస్తాలను దించుకునేవరకు ఇక్కడి నుంచి వెళ్లేది లేదు.
– బసప్ప, రైతు కన్మనూర్
150 బస్తాలు తెచ్చా..
ట్రాక్టర్ను అద్దెకు తీసుకొని 150 బస్తాలను లోడ్ చేసి గుడేబల్లూర్ సమీపంలోని మిల్లుకు తీసుకువచ్చా. రెండు రోజులైనా ఖాళీ చేయడం లేదు. నాతో పాటు మిగతా రైతుల పరిస్థితి ఇదే. లేబర్ చార్జీలు సైతం వసూలుచేస్తున్నారు. అధికారులు, పాలకులు స్పందించి రైతులకు అండగా నిలవాలని కోరుతున్నాం.
– శ్రీధర్, రైతు వడ్వాట్
ధాన్యం దించుకోవడంలేదు
ధాన్యం బస్తాలతో ట్రాక్టర్ను వరుసలో పెట్టి నాలుగు రోజులు అవుతుంది. టోకెన్లు ఇచ్చారు. నాలుగు రోజుల తర్వాత తమ మిల్లుకు ఇచ్చిన టార్గెట్ అయిపోయిందంటూ ధాన్యం బస్తాలను దించుకోమని చెప్పడంతో ఏంచేయాలో అర్థం కావడంలేదు. విధిలేక ఆందోళనకు దిగితే.. అధికారులు అక్కడికి చేరుకొని ధాన్యం బస్తాలను దించుకునేలా ఆదేశించారు. రోజుల తరబడి రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు.
– బచ్చప్ప, రైతు, ఉందేకోడు

చివరి గింజ వరకు కొంటాం..

చివరి గింజ వరకు కొంటాం..