కృష్ణా: పదో తరగతి విద్యార్థులతోపాటు ఇంటర్ విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలని డీఈఓ గోవిందరాజులు సూచించారు. బుధవారం మండలంలోని కేజీబీవీ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెరుగైన ఉత్తీర్ణత సాధించేందుకు అనుసరించాల్సిన విషయాలను వివరించారు. అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ప్రతి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెనుక ఎంఈఓ నిజామూద్గీన్,ఎండీఎం యాదయ్యశెట్టి,జీసీడీఓ నర్మద, ఎస్ఓ షాలిని,సీఆర్పీ అమీన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.