
ఏజెన్సీపై కూటమి నేతల ఒత్తిడి.. ఈఈని పక్కకు పెట్టిన సీఈ
● విజిలెన్స్ తనిఖీ నివేదిక ఆధారంగా ఏ మేరకు ఆ ప్రాంతంలో పనులు చేయలేదో గుర్తించేందుకు హంద్రీనీవా డివిజన్–3 ఈఈ పర్యవేక్షణలో ఏజెన్సీ, ఇంజినీర్లు చేస్తున్న కొలతలపై తనకు ఏ రోజుకా రోజు నివేదిక ఇవ్వాలని ఏజెన్సీకి ఈఈ సూచించారు.
● దీనిపై ప్యాకేజీ–2 ఏజెన్సీ వీపీఆర్–డీఎస్ఆర్ (నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డికి సంబంధించినది) జల వనరుల శాఖ ఉన్నతాధికారుల ద్వారా ఒత్తిడి చేయడంతో డివిజన్–3 పరిధిలోని పనుల బాధ్యతల నుంచి ఈఈని తొలగించి, డివిజన్–4 ఈఈకి అప్పగించారు.
● ఈ విషయంలో హంద్రీనీవా–1 ఎస్ఈ అభ్యంతరం చెప్పినా కూడా సీఈ వినిపించుకోలేదని సమాచారం.
● జల వనరుల శాఖలో గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదని, ఇదే మొదటిసారిగా ఆ శాఖ ఇంజనీర్లలో చర్చ జరుగుతోంది.