
మత్తు పదార్థాలతో జీవితం నాశనం
కర్నూలు కల్చరల్: మత్తు పదార్థాలతో యువత జీవితం నాశనం చేసుకోవద్దని రాయలసీమ యూనివర్సిటీ వైస్ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు పిలుపునిచ్చారు. గురువారం వర్సిటీలోని కాన్ఫరెన్స్ హాల్లో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వీసీ మాట్లాడుతూ వర్సిటీ క్యాంపస్లో డ్రగ్స్కు స్థానం లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. యువత బంగారు భవితకు బాటలు వేసుకునే దిశగా ఆలోచన చేయాలన్నారు. వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్టీకే నాయక్ మాట్లాడుతూ బాధ్యత గలిగిన పౌరులుగా మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. వాటి బారిన పడిన వారికి పునరావాస కేంద్రాల ద్వారా సరైన చికిత్స అందేలా చూడాలన్నారు. అనంతరం వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ బోయ విజయ్కుమార్ నాయుడు, సీడీసీ డీన్ ఆచార్య పీవీ సుందరాననంద్, డీన్ ఆఫ్ అకడమిక్స్ అఫైర్స్ ఆచార్య ఆర్.భరత్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా వీసీ ప్రతిజ్ఞ చేయించారు. అంతకు ముందు మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీని ఆర్యూ వద్ద వీసీ జెండా ఊపి ప్రారంభించారు. రాజ్విహార్ నుంచి కల్టెరేట్ వరకు జరిగిన ర్యాలీలో వర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.