వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం

Jun 25 2025 7:04 AM | Updated on Jun 25 2025 7:04 AM

వ్యవస

వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం

● ఆకాశాన్నంటిన రసాయన ఎరువులు, పురుగు మందుల ధరలు ● యాంత్రికంగా మద్దతు ధరలను ప్రకటించిన కేంద్రం ● క్షేత్రస్థాయి వాస్థవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోని వైనం ● రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చల ఊసే కరువు

2025–26 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు నిరాశజనకంగా ఉన్నాయి. మద్దతు ధరలను అశాసీ్త్రయంగా ప్రకటించినట్లు కనిపిస్తోంది. పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మినుము ఇలా అన్ని పంటల్లో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. వరికి హెక్టారుకు పెట్టుబడి వ్యయం రూ.1.30 లక్షల వరకు ఉంటోంది. మద్దతు ధరలపై కేంద్రం పునఃసమీక్ష నిర్వహించాల్సిన అవసరం ఉంది.

– జి.రామకృష్ణ, జిల్లా ప్రదాన కార్యదర్శి,

ఏపీ రైతు సంఘం, కర్నూలు

కేంద్రం ప్రకటించిన మద్దతు ధరలు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. పత్తిలో హెక్టారుకు రూ.లక్షకు పైగా పెట్టుబడి వ్య యం వస్తోంది. రసాయన ఎరువులు, పురుగు మందు లు, లేబర్‌ చార్జీలు, పెట్రోలు, డీజిల్‌ ధరలు, ట్రాక్టరు, ఇంప్లిమెంట్స్‌ బాడుగలతో పాటు అన్ని రకాల ఖర్చు లు పెరిగిపోయాయి. దిగుబడి 8–10 క్వింటాళ్ల వరకు మాత్రమే ఉంటోంది. క్వింటాకు మద్దతు ధర రూ.10 వేలు ఉంటేనే రైతులకు న్యాయం జరుగుతుంది.

– వేణుబాబు, అధ్యక్షుడు, ఏపీ విత్తన రైతు సంఘం

నాకు 14 ఎకరాల సొంత భూమి ఉంది. మరో 30 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశాను. గతేడాది వరిసాగు చేసి నష్టపోయా. మద్దతు ధర ఆశాజనకంగా ఉంటే దళారీలు కూడా అదే ధర ఇవ్వడానికి ముందు కు వస్తారు. మేము కూడా డిమాండ్‌ చేస్తాం. మద్దతు ధర కనీసం రూ.2600 ఉంటే పెట్టుబడి చేతికొస్తుంది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

– వెంకటేశ్వర రెడ్డి, లింగాపురం,

బండి ఆత్మకూరు మండలం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో మొక్కజొన్న ప్రధాన పంట. కర్నూలు జిల్లాలో 5,101, నంద్యాల జిల్లాలో 50,155 హెక్టార్లలో సాగవుతోంది. భూమి చదును చేసుకోవడం, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, సేద్యం, లేబర్‌ చార్జీలు.. ఇలా అన్ని రకాల ఖర్చులు కలిపి వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం హెక్టారుకు పెట్టుబడి వ్యయం రూ.66,642. హెక్టారుకు దిగుబడి 25 క్వింటాళ్లు వస్తుందని అంచనా.

అంటే క్వింటా మొక్కజొన్న పండించడానికి రైతుకు అవుతున్న ఖర్చు రూ.2,665. అయితే కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి క్వింటా మొక్కజొన్నకు ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,400 మాత్రమే. కేంద్రం ప్రకటించిన మద్దతు ధరతో అమ్ముకుంటే పెట్టిన పెట్టుబడి కూడా దక్కదని రైతులు వాపోతున్నారు.

కర్నూలు(అగ్రికల్చర్‌): ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2025–26 సంవత్సరానికి వివిధ పంటలకు మద్దతు ధరలను ప్రకటించింది. వ్యవసాయంలో పెట్టుబడి వ్యయం భారీగా పెరిగింది. క్షేత్రస్థాయిలో పర్యటించి వాప్తవ పరిస్థితులను గుర్తించి, రైతులు, రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించిన తర్వాత మద్దతు ధరలను ప్రకటించాల్సి ఉంది. అయితే ఇటీవల ప్రకటించిన మద్దతు ధరలను పరిశీలిస్తే యాంత్రికంగా ప్రకటించినట్లుగా స్పష్టమవుతోంది. రసాయన ఎరువుల ధరలను కేంద్రం అడ్డగోలుగా పెంచింది. పురుగు మందల ధరలు కొండెక్కాయి. సేద్యం, కూలీ ఖర్చులు భారీగా పెరిగాయి. ఫలితంగా సాగులో పెట్టుబడి వ్యయం గణనీయంగా పెరిగింది. అందుకు అనుగుణంగా ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలను సవరించాల్సి ఉంది. అలాంటిది పెట్టుబడి వ్యయానికి, ఇటీవల ప్రకటించిన మద్దతు ధరలకు పొంతన లేకపోవడం గమనార్హం. మద్దతు ధరలు లేకపోతే దళారీలు చెప్పిందే ధర అయ్యే ప్రమాదం ఉంది.

పెట్టుబడి వ్యయం కొండంత..

మద్దతు ధరలు అంతంతే!

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న, వేరుశనగ, కంది, మినుము, జొన్న సాగు చేస్తారు. ఏ పంటకు చూసిన కాస్ట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ భారీగా ఉంది. మద్దతు ధరలను ప్రకటించడంలో విధిగా పంటల వారీగా కాస్ట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌ను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది. అయితే 2025–26 ఏడాది కాస్ట్‌ ఆఫ్‌ కల్టివేషన్‌, దిగుబడులను పరిగణనలోకి తీసుకోకుండా మద్దతు ధరలను ప్రకటించడం వల్ల రైతుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు కేంద్రంలో కీలకంగా ఉన్నారు. రాష్ట్రంలో కూడా బీజేపీతో కలసి ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. మద్దతు ధరల ప్రకటనలో రైతులకు అన్యాయం జరిగినప్పటికీ కనీస స్పందన లేకుండా పోయింది. గతంలో వ్యవసాయం దండగ అని మాట్లాడిన చంద్రబాబు నేడు మద్దతు ధరల్లో జరిగిన అన్యాయాన్ని ఎలా పట్టించుకుంటారనే చర్చ రైతుల్లో జరుగుతోంది.

కనిష్టంగా రూ.69.. గరిష్టంగా రూ.596

కేంద్రం 2025–26 సంవత్సరానికి సవ రించిన మద్దతు ధరలు రైతులకు నిరాశ, ఆందోళన మిగిల్చాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరి ప్రధాన ఆహార పంట. ఈ పంటలో పెట్టుబడి వ్యయం ఏడాదికేడాది పెరుగుతోంది. కానీ మద్దతు ధరలను కనిష్టంగా రూ.69, గరిష్టంగా రూ. 596 మాత్రమే పెంచడం పట్ల రైతుల్లో నిరుత్సా హం వ్యక్తమవుతోంది. 2024 –25 మద్ద తు ధరపై కేవలం రూ.69 మా త్రమే పెరి గింది. కనీస మద్దతు ధర రూ. 2,600 పైన ఉంటే ధాన్యం రైతుకు కొంతమేర న్యాయం జరుగుతుందనే అభిప్రా యం వ్యక్తమవుతోంది. దాదాపుగా మిగిలిన పంటలదీ ఇదే పరిస్థితి.

వివిధ పంటల్లో హెక్టారుకు పెట్టుబడి వ్యయం ఇలా..

పంట పెట్టుబడి వ్యయం క్వింటా ఉత్పత్తికి మద్దతు ధర

(రూశ్రీశ్రీల్లో) అవుతున్న వ్యయం(రూశ్రీశ్రీల్లో) (రూశ్రీశ్రీల్లో)

మొక్కజొన్న 66,641 2,666 2,400

సజ్జ 38,851 2,775 2,775

వరి 1,24,096 2,160 2,389

జొన్న 77,376 3,517 3,699

పత్తి 95,107 7,336 8,110

కంది 64,486 7,271 8,000

కొర్ర 31,382 2,617 2,500

వేరుశనగ 1,06,662 5,480 7,263

వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం 
1
1/2

వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం

వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం 
2
2/2

వ్యవసాయంలో పెరిగి పోతున్న పెట్టుబడి వ్యయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement