
మల్లన్న క్షేత్రం.. అభివృద్ధికి దూరం
● ఏడాది పూర్తయినా ఒక్క అభివృద్ధి పని చేపట్టని కూటమి ప్రభుత్వం ● వైఎస్సార్సీపీ హయాంలో ప్రారంభించిన రూ.125 కోట్ల పనులు నిలుపుదల ● భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో విఫలం
రూ.125 కోట్ల పనులను ఆపేశారు..
శ్రీశైలంటెంపుల్: శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరుగుతుంది. శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం, భక్తుల రద్దీకి అనుగుణంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాదిపైన కావస్తున్నా ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని ప్రారంభించలేదు. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.125 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా.. కూటమి ప్రభుత్వం ఆయా పనులను తమకు నచ్చిన కాంట్రాక్టర్కు ఇచ్చుకోవాలని, కొన్ని డిజైన్లు సరిగా లేవని తదితర కారణాలు చూపుతూ నిలుపుదల చేశారు. కానీ ఇంతవరకు ఒక్క అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తరువాత హడావుడిగా సుమారు 109 పనులకు టెండర్ పిలిచారు. కానీ ఆయా పనులు తమ పార్టీ వారికి అనుకూలంగా ఇచ్చుకుంటున్నారని దేవదాయ కమిషనర్కు ఫిర్యాదు అందడంతో ఆ టెండర్లను రద్దు చేశారు. అత్యవసర పనులకు, మహాశివరాత్రి, ఉగాది బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులకు మాత్రమే అనుమతించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినా ఇంతవరకు ఒక్క అభివృద్ధి పని చేయలేదు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు, ఉగాది ఉత్సవాలకు, కార్తీకమాసం, దసరా, సంక్రాంతి ఉత్సవాలకు చేసే ఏర్పాట్లు తప్పా ఇతర అభివృద్ధి కార్యక్రమాలు ఏమి చేపట్టలేదు. అడపాదడపా కొన్ని అత్యవసర పనులు తప్పా చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనే చెప్పుకోవాలి.
రూ.12 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు..
కూటమి ప్రభుత్వం ఏడాది అనంతరం గత నాలుగు రోజుల క్రితం శ్రీశైల దేవస్థానం సుమారు రూ. 12 కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు ఆహ్వానించింది. సుమారు రూ.8కోట్లతో మేజర్ వర్క్లు, రూ.4 కోట్లతో మైనర్ పనులకు ఆ టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు అయినా సక్రమంగా జరుగుతాయో లేక గతంలో మాదిరి రద్దు చేస్తారో వేచి చూడాలి. ఇప్పటికై న కూటమి ప్రభుత్వం శ్రీశైల మహాక్షేత్రం అభివృద్ధిపై దృష్టిసారించి, క్షేత్రంలో భక్తుల సౌకర్యార్థం పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.
శ్రీశైల మహాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి, క్షేత్రానికి విచ్చేసే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సంకల్పించింది.ఇందులో భాగంగానే దేవాదాయశాఖపై మాజీ సీఎం జగన్ పలుమార్లు సమీక్షలు నిర్వహించి శ్రీశైల క్షేత్రంలో సుమారు రూ.125కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. రూ.75 కోట్ల అంచనా వ్యయంతో అధునాతన సదుపాయాలతో నూతన క్యూకాంప్లెక్స్, రూ.35 కోట్లతో సువిశాలమైన సాలు మండపాలు, రూ.5.5కోట్లతో శ్రీశైలక్షేత్రానికి సంబంధించిన 4,400 ఎకరాల భూమికి ఫారెస్ట్ బౌండరీ ఏర్పాటు, రూ.కోటితో పంచమఠాలన్నింటిని భక్తులు ఒకేసారి దర్శించేలా ఏకరూట్ ఏర్పాటు, రూ.2.6 కోట్లతో శ్రీశైలంలోని మల్లమ్మకన్నీరు వద్ద 10 లక్షల లీటర్ల సామర్థ్యంతో వాటర్ ట్యాంకుల నిర్మాణం, రూ.1.6 కోట్లతో క్షేత్ర పరిధిలోని పలుచోట్ల 50 లక్షల వాటర్ ట్యాంకు నిర్మాణాలు, రూ.2 కోట్లతో ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద దేవస్థాన స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్, రూ.1.8 కోట్లతో ప్రకాశం జిల్లా దోర్నాల వద్ద నూ తన కల్యాణమండపాన్ని నిర్మించేందుకు టెండర్లు పిలిచి 2023 డిసెంబరు 27న మాజీ దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తదితరు లు శంకుస్థాపన చేశారు. అనంతరం సాధారణ ఎన్ని కలు రావడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో వివిధ కారణాలతో ఆయా టెండర్లను రద్దు చేశారు.

మల్లన్న క్షేత్రం.. అభివృద్ధికి దూరం

మల్లన్న క్షేత్రం.. అభివృద్ధికి దూరం