
అరటి రైతులకు అపారనష్టం
కొలిమిగుండ్ల: ఈదురుగాలల బీభత్సంతో అరటి రైతులకు అపార నష్టం వాటిల్లింది. అరటి గెలలు కోత కోసే సమయంలో బలమైన గాలులు వీయడంతో గెలలతో సహ చెట్లు నేలకొరిగాయి. మదనంతపురం, కోర్నపల్లె తదితర గ్రామాల్లో రైతులు వంద ఎకరాలకు పైగానే అరటి సాగు చేశారు. రెండు మూడు రోజుల్లో కోత కోసేందుకు సిద్ధంగా ఉన్న సమయంలో అకాల వర్షం రూపంలో నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. చేతికొచ్చిన పంట నేలపాలు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. పది రోజుల ముందుగానే చాలా మంది రైతులు అరటి గెలలను కోసుకున్నారు. మొక్క జొన్న ఆరబెట్టుకోవడంతో వర్షం దాటికి తడిసిపోయాయి. మిరప రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జిల్లాలో అత్యధికంగా కొలిమిగుండ్ల మండలంలో 48 మి.మీ వర్షపాతం నమోదైంది.