ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి | - | Sakshi
Sakshi News home page

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

Apr 23 2025 8:13 AM | Updated on Apr 23 2025 8:49 AM

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

ఖైదీలు సత్ప్రవర్తనతో మెలగాలి

నంద్యాల(వ్యవసాయం): నంద్యాల సబ్‌ జైల్‌కు మంగళవారం మూడో అదనపు జిల్లా జడ్జి అమ్మన్నరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన జైల్‌ అధికారులతో మాట్లాడుతూ జైల్లో పరిసరాలు, గదుల ను పరిశీలించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఖైదీల హాజరు పట్టికను పరిశీలించి వారి ఆరోగ్యంపై ఆరా తీశారు. ఖైదీలు తమ కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు. కేసులు వాదించడానికి జైలుకు ప్రత్యేక ప్యానల్‌ న్యాయవాదిని ఏర్పాటు చేశామని, ఎటువంటి రుసుం లేకుండా న్యాయ సహాయం అందజేస్తారన్నారు. కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్‌ గురు ప్రసాద్‌ రెడ్డి, కోర్టు సిబ్బంది రామచంద్రారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement