బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Nov 8 2025 7:30 AM | Updated on Nov 8 2025 7:30 AM

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

నల్లగొండ టౌన్‌ : బీసీలకు.. విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్‌ కల్పించాలని కోరుతూ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నల్లగొండలోని గడియారం సెంటర్‌లో శుక్రవారం రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్‌ మునాస ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ ఈనెలాఖరున జరగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో బీసీల 42 శాతం రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గండిచెరువు వెంకన్నగౌడ్‌, జనార్దన్‌గౌడ్‌, ఎంఏ.ఖదీర్‌, పుట్ట వెంకన్నగౌడ్‌, కర్నాటి యాదగిరి, చిలుకరాజు సతీష్‌, మార్గం సతీష్‌ కుమార్‌, కొంపల్లి రామన్నగౌడ్‌, చెన్నోజు రాజు, చెన్నోజు భరద్వాజ, కల్లూరి సత్యనారాయణగౌడ్‌, నీలం వెంకటమధు, అనంత నాగరాజుగౌడ్‌, గడగోజు విజయ్‌, తలారి రాంబాబు, ఆమంచి స్వామి, అంబటి శివ, పుల్లెందుల అంజయ్య, గడ్డం మారయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement