
యాదగిరీశుడికి మరింత భద్రత
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి మరింత భద్రత కల్పించేందుకు ఆలయ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
- 8లో
నార్కట్పల్లి : మండలంలోని చెర్వుగట్టు శ్రీపార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయంలో బుధవారం రాత్రి స్వామివారికి లక్ష పుష్పార్చన పూజ నిర్వహించారు. అమావాస్య కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయ ఆవరణలో నిద్ర చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు. పూజల్లో ప్రధాన అర్చకులు రామలింగేశ్వరశర్మ, సతీష్శర్మ, సురేష్ శర్మ, శ్రీకాంత్శర్మ, ఈఓ నవీన్కుమార్ పాల్గొన్నారు.