
యాంటీ డ్రగ్ సోల్జర్గా పనిచేయాలి
నల్లగొండ : మాదక ద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ యాంటీ డ్రగ్ సోల్జర్గా పనిచేయాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు. బుధవారం నల్లగొండలో మాదక ద్రవ్యాల వల్ల కలిగే నష్టాలు, వాటి బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తెలిపారు. డ్రగ్స్పై పోలీసులు చేస్తున్న పోరాటంలో యువత పాలుపంచుకోవాలని కోరారు. యువత డ్రగ్స్ సేవించి పట్టుబడి కేసు నమోదు అయితే భవిష్యత్లో ఉద్యోగాలకు, ఏ ఇతర దేశాలకు కూడా వెళ్లే అవకాశం దొరకక జీవితం అంధకారం అవుతుందన్నారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిస్తే, టోల్ ఫ్రీ నెంబర్ (8712670266)కు తెలియజేయాలని కోరారు. అనంతరం మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేయించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాంరెడ్డి, సీఐలు రాఘవరావు, రాజశేఖర్రెడ్డి, ఎస్ఐ సైదులు, వివిధ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్చంద్ర పవార్