పెదా్దసుపత్రిలో వైద్య పరీక్షల్లేవ్‌! | - | Sakshi
Sakshi News home page

పెదా్దసుపత్రిలో వైద్య పరీక్షల్లేవ్‌!

Jun 26 2025 6:21 AM | Updated on Jun 26 2025 6:21 AM

పెదా్

పెదా్దసుపత్రిలో వైద్య పరీక్షల్లేవ్‌!

నల్లగొండ టౌన్‌ : ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో రక్త పరీక్షలు నిలిచిపోయాయి. ఆస్పత్రిలోని తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రంలో సుమారు 45 రకాల రక్త పరీక్షలు చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం కొన్నిరకాల పరీక్షలను మాత్రమే చేస్తున్నారు. పరీక్షల కోసం రక్తంలో కలిపే రీఏజెంట్స్‌(కెమికల్స్‌) సరఫరా నిలిచిపోయిన కారణంగా పరీక్షలు చేయడం లేదు. ప్రస్తుతానికి కేవలం సీబీపీ(కంప్లీట్‌ బ్లడ్‌ పిక్షర్‌)తో పాటు మలేరియా తదితర పరీక్షక్షలు మాత్రమే చేస్తున్నారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్‌లో వేల రూపాయలు వెచ్చించి టెస్టులు చేయించుకుంటున్నారు.

ప్రైవేట్‌లో పరీక్షలు చేయించుకోవాల్సిందే

ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి రోజూ వందల సంఖ్యలో రోగులు వస్తుంటారు. ఇన్‌పేషంట్లు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చే వారి రోగ నిర్ధారణకు రక్త పరీక్షలు ప్రధానం. కానీ, తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రంలో పరీక్షలు నిలిచిపోవడంవతో రోగులు బయటి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌లో పరీక్షలను చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుత సీజన్‌లో డెంగీ పరీక్షలను నిర్ధారించడానికి అవసరమైన ఎలిసా పరీక్షలను చేయాల్సిన మిషన్‌ గత కొన్ని రోజులుగా మరమ్మతుకు గురైంది. దీంతో డెంగీ నిర్ధారణకు చేయాల్సిన ఎలిసా టెస్టులు కూడా పూర్తిగా నిలిచిపోయాయి.

పీహెచ్‌సీల నుంచి నిలిచిన రక్త నమూనాలు

జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్ల నుంచి రోజూ రోగుల నుంచి రక్తనమూనాలను సేకరించి టెస్ట్‌ల కోసం తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రానికి వాహనాల ద్వారా తీసుకొస్తారు. అక్కడ రక్త నమూనాలు ఇచ్చిన రోగులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు పరీక్షల ఫలితాలను సెల్‌ఫోన్‌కు పంపిస్తారు. రక్త పరీక్షల ఆధారంగా మెడికల్‌ ఆఫీసర్లు రోగులకు చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఇలా రోజూ వందల సంఖ్యలో రక్త నమూనాలను తెలంగాణ డయాగ్నోస్టిక్‌ కేంద్రానికి వస్తాయి. ప్రస్తుతం టెస్టులు నిలిచిపోవడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రక్త నమూనాలు పంపించడం లేదు. రక్త పరీక్షలకు అంతరాయం ఏర్పడి రోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.

ఫ జీజీహెచ్‌లోని తెలంగాణ హబ్‌లో నిలిచిన బ్లెడ్‌ టెస్ట్‌లు

ఫ రీఏజెంట్స్‌ సరఫరా

లేకపోవడమే కారణం

ఫ మరమ్మతుకు గురైన ‘ఎలీసా’ మిషన్‌

ఫ కొన్ని పరీక్షలు మాత్రమే చేస్తున్న సిబ్బంది

త్వరలో అన్ని రకాల టెస్టులు చేస్తాం

రక్త పరీక్షలు చేయడానికి అవసరమైన రీఎజెంట్స్‌ అయిపోయినందున కొన్ని పరీక్షలను చేయలేకపోతున్నాం. ప్రభుత్వానికి ఇండెంట్‌ పెట్టాం. అవి సరఫరా కాగానే అన్ని రకాల టెస్టులు చేస్తాం. ఎలీసా పరీక్ష చేసే మిషన్‌ మరమ్మతుకు గురైంది. త్వరలో దాన్ని కూడా బాగు చేయించి టెస్టులు చేస్తాం.

– డాక్టర్‌ కళ్యాణ్‌చక్రవర్తి, తెలంగాణ

డయాగ్నోస్టిక్‌ కేంద్రం ఇన్‌చార్జి

పెదా్దసుపత్రిలో వైద్య పరీక్షల్లేవ్‌!1
1/1

పెదా్దసుపత్రిలో వైద్య పరీక్షల్లేవ్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement