
రాష్ట్రానికి.. కేంద్రం రూ.11 లక్షల కోట్లు ఇచ్చింది
నల్లగొండ టూటౌన్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాభివృద్ధి కోసం 11 ఏళ్లల్లో రూ.11 లక్షల కోట్లు ఇచ్చిందని మహబూబ్నగర్ ఎంపీ, మాజీమంత్రి డి.కె.అరుణ అన్నారు. బుధవారం నల్లగొండలోని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ పాఠశాలలు, యూనివర్సిటీలు, రోడ్లు తదితర వాటి కోసం మోదీ ప్రభుత్వం అధిక నిధులు ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నరేంద్రమోదీపై ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. స్థానికసంస్థల ఎన్నికలు పెట్టే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని, బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎందుకు లేఖ రాయడంలేదని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ తన పదవిని నిలుపుకోవడానికి ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచారని మండిపడ్డారు. ఆ కాలంలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను రద్దు చేసి, పత్రికలను అణచి వేశారని, అదే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు డిజిటల్ మీడియాలో బీజేపీ, కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 60 ఏళ్లు కుటుంబ పాలన కొనసాగిన దేశం అభివృద్ధి చెందలేదన్నారు. ప్రధాని మోదీ దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే నంబర్వన్గా నిలబెట్టుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా అమలు చేయలేదన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్రెడ్డి, నాయకులు గోలి మధుసూదన్రెడ్డి, వీరెల్లి చంద్రశేఖర్, కన్మంతరెడ్డి శ్రీదేవిరెడ్డి, దర్శనం వేణు, కంచర్ల విద్యాసాగర్రెడ్డి, రావెళ్ల కాశమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఫ మహబూబ్నగర్ ఎంపీ డికె.అరుణ