
ఆదరించట్లేదు.. ఆదుకోండమ్మా
నల్లగొండ : కనిపెంచి పెద్ద చేశాం.. ఆస్తులు పంచిచ్చాం.. వృద్ధాప్యంలో ఉన్న మమ్ములను కన్న కొడుకులు సరిగా చూసుకోవడం లేదని పలువురు వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో కలెక్టర్ ఇలా త్రిపాఠికి పలువురు వృద్ధులు తమ గోడు వినిపించారు. కన్నకొడుకులు ఆదరించట్లేదు.. మమ్ములను ఆదుకోండమ్మా అంటూ కలెక్టర్కు తమ సమస్యలను విన్నవించారు. వృద్ధులతోపాటు వివిధ సమస్యలను విన్నవించేందుకు జనం కూడా భారీగా వచ్చి ఫిర్యాదులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్, డీఆర్ఓ అశోక్రెడ్డి, డీఆర్డీఓ శేఖర్రెడ్డిలు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఫ ఆస్తులు పంచిచ్చినా కొడుకులు అన్నం పెట్టట్లేదు
ఫ ప్రజావాణిలో గోడు వినిపించిన పలువురు వృద్ధులు
ఫ కలెక్టర్కు ఫిర్యాదుల వెల్లువ