
వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం
చింతపల్లి: మండల కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ 18వ వార్షికోత్సవం ముగింపు సందర్భంగా ఆలయంలో గురువారం శ్రీస్వర్ణగిరి శ్రీవేంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ముక్కామల క్షేత్ర పీఠాధిపతి శ్రీధర్స్వామి ఆధ్వర్యంలో రామ్చరణ్ శర్మ, కిరణ్ శర్మలు పూర్ణాహుతి హోమం జరిపారు. సాయిబాబా విగ్రహానికి వైభవంగా అభిషేకం నిర్వహించారు. భక్తులకు అన్న ప్రసాదాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మంచికంటి ధనంజయ్య పావని, ప్రధాన కార్యదర్శి కొమిరిశెట్టి వెంకటయ్య చంద్రకళ, కుంభం పుల్లారెడ్డి సుకన్య, టి.శ్రీనివాస్ లతా దంపతులు, కోశాధికారి ఊరె కృష్ణయ్య, ట్రస్ట్ సభ్యులు మంచి కంటి జనార్దన్, ఆలంపల్లి చంద్రశేఖర్, కొమిరిశెట్టి అశోక్, ఆలంపల్లి పాండురంగయ్య, రవి, మంచి కంటి శ్రీనివాస్, ఆగిరి రవి, గోవింద్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
ఫ ముగిసిన సాయి ఆలయ వార్షికోత్సవాలు

వైభవంగా శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణం