
ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు అనుమతులు
దేవరకొండ: దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి 25 ఎకరాల్లో రూ.200 కోట్ల నిధులతో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ పాఠశాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చినట్లు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ తెలిపారు. గురువారం దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేవరకొండ నియోజకవర్గానికి సంబంధించి కొండమల్లేపల్లి మండలం కోల్మంతల్పహాడ్ వద్ద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి అనుమతులు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. నేరేడుగొమ్ములో దాదాపు రూ.47కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం జీఓ జారీ చేసిందన్నారు. సమావేశంలో నాయకులు ఆలంపల్లి నర్సింహ, ఎంఏ సిరాజ్ఖాన్, నాయిని మాధవరెడ్డి, మారుపాకల సురేష్గౌడ్, శిరందాసు కృష్ణయ్య, హన్మంతు వెంకటేష్గౌడ్, కొర్ర రాంసింగ్, సుగుణయ్య ఉన్నారు.
ఫ ఎమ్మెల్యే బాలునాయక్