
ముందస్తు వర్షాలతో కృష్ణానదికి వరద
నాగార్జునసాగర్: ముందస్తుగా కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరదలు ప్రారంభమయ్యాయి. కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ఎగువ ప్రాజెక్టులలోకి మోస్తారుగా వరద వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాజెక్టులన్నీ ఖాళీగాఉన్నా.. మూడునెలల ముందుగా మేలోనే వరదలు మొదలవడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. జూరాల ప్రాజెక్టు భారీ వర్షాలకు ప్రాజెక్టుకు అధికంగా వరద వచ్చింది. ఎగువ నుంచి 82 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో 12 గేట్లు రెండు మీటర్ల ఎత్తు ఎత్తి అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వరదలు మొదలైతే గత ఏడాది కన్నా ముందుగానే ప్రాజెక్టులు నిండే అవకాశాలు ఉంటాయని సాగునీటి శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయం నీటిమట్టం 512.50 అడుగులుగా కాగా 135.9545 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గరిష్ట నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు).
ఫ రైతుల్లో చిగురిస్తున్న ఆశలు