
భవిత కేంద్రాల్లో పనులు పూర్తిచేయాలి
నల్లగొండ: భవిత కేంద్రాల్లో చేపట్టిన పనులను వారం రోజుల్లో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె నల్లగొండ కలెక్టరేట్లోని ఉదయాదిత్య భవన్లో భవిత కేంద్రాలపై అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 22 భవిత కేంద్రాలకు సివిల్ పనులు ప్రారంభించేందుకు అడ్వాన్స్ నిధులు మంజూరు చేశామన్నారు. భవిత కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తే పిల్లల సంఖ్య పెరుగుతుందన్నారు. అన్ని భవిత కేంద్రాల్లో టాయిలెట్లు, రైలింగ్, ర్యాంపు, యాక్టివిటీ రూమ్లు ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా భవిత కేంద్రాల్లో వినియోగించనున్న సామగ్రి, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ను ప్రదర్శించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, నల్లగొండ, దేవరకొండ ఆర్డీకోలు అశోక్రెడ్డి, రమణారెడ్డి, మండల ప్రత్యేక అధికారులు, ఎంఈఓలు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ ఇలా త్రిపాఠి