
గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం
చారకొండ/వెల్దండ: గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. సోమవారం చారకొండ మండలం చంద్రాయన్పల్లిలో రూ. 4.48కోట్లతో బీటీరోడ్డు నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. అదే విధంగా వెల్దండ మండలంలో రూ. 4.48కోట్లతో భైరాపూర్–అజిలాపూర్ బీటీరోడ్డు నిర్మాణానికి, కుప్పగండ్ల–పెద్దాపూర్ మార్గంలో రూ. 2.50కోట్లతో వంతెన నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అన్నివిధాలా అభివృద్ధి చెందుతున్నాయని వివరించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అర్హులందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో ప్రతి పేద కుటుంబం సొంతింటి కలను సాకారం చేస్తామన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీ సింగ్, మాజీ జెడ్పీటీసీ వెంకట్గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ వెంకటయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బాల్రాంగౌడ్, మాజీ సర్పంచులు వసంత, భూపతిరెడ్డి, నాయకులు సాంబయ్యగౌడ్, వెంకటయ్యగౌడ్, మోతీలాల్ నాయక్, సంజీవ్కుమార్, పర్వత్రెడ్డి, తిరుపతిరెడ్డి, కృష్ణ, ఎర్ర శ్రీను, హరికిషన్, నారాయణ, రాంచంద్రాద్రారెడ్డి, వెంకట్రెడ్డి, గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.