
‘ప్రజావాణి’ ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి
నాగర్కర్నూల్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అమరేందర్, దేవ సహాయం అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు తమ సమస్యలను విన్నవిస్తూ ఫిర్యాదులు సమర్పించారు. కార్యక్రమం ముగిసే సమయానికి 47 ఫిర్యాదులు అందగా.. పెండింగ్లో ఉంచకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.