మైసమ్మ ఆలయం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

మైసమ్మ ఆలయం పరిశీలన

Sep 9 2024 2:14 AM | Updated on Sep 9 2024 2:14 AM

మైసమ్

మైసమ్మ ఆలయం పరిశీలన

పెద్దకొత్తపల్లి: నాయినోనిపల్లి మైసమ్మ ఆలయాన్ని ఆదివారం దేవాదాయ, పర్యాటక శాఖల అధికారులు పరిశీలించారు. ఆలయ కమిటీ చైర్మన్‌ శ్రీనివాసులుతో కలిసి ఎండోమెంట్‌ ఎస్‌పీ కనకదుర్గ ప్రసాద్‌, డీఈ వేమూరి శ్రీనివాస శర్మ, టూరిజం శాఖ ఎండీ విజయ్‌, చీఫ్‌ ఇంజినీరు వెంకటరమణ, డీఈ పర్శవేది, ఏఈ నాగార్జున, ఎండోమెంట్‌ అధికారి రమేశ్వరశర్మలు మైసమ్మ ఆలయ పరిసరాలను పరిశీలించడంతో పాటు భక్తులకు కల్పిస్తున్న వసతులపై ఆరా తీశారు. అంతకుముందు మైసమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. కాగా, ఆలయం నలుదిక్కుల రాజగోపురాలు, సీసీరోడ్లు నిర్మించడంతో పాటు భక్తులకు వంటషెడ్లు, బస్‌ షెల్టర్‌ తదితర సౌకర్యాలు కల్పించాలని చైర్మన్‌ కోరారు. అనంతరం అధికారులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో సీనియర్‌ అసిస్టెంట్‌ శ్రీనివాస్‌రెడ్డి ఉదయ్‌రెడ్డి, లలిత పాల్గొన్నారు.

హాస్టళ్లపై నిర్లక్ష్యం తగదు

పెద్దకొత్తపల్లి: వసతిగృహాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి తారాసింగ్‌ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలికల హాస్టల్‌ను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అనేక వసతిగృహాల్లో వార్డెన్‌ పోస్టులు ఖాళీగా ఉండటంతో విద్యార్థుల సమస్యలను పట్టించుకునే నాథుడే కరువయ్యారని అన్నారు. ఎస్సీ, బీసీ వసతిగృహాల్లో వార్డెన్లు, సిబ్బందిని నియమించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో అభిరాం, అభిలాష్‌ పాల్గొన్నారు.

ఉమ్మడి జిల్లా ఖోఖో కార్యవర్గం ఎన్నిక

మహబూబ్‌నగర్‌ క్రీడలు: జిల్లాకేంద్రంలో భవిష్యత్‌లో రాష్ట్ర, జాతీయస్థాయి ఖోఖో పోటీలు నిర్వహించుకుందామని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ ఒబేదుల్లా కొత్వాల్‌ అన్నా రు. స్థానిక టీఎన్‌జీఓ భవన్‌లో ఆదివారం ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం సర్వసభ్య సమావేశం, ఎన్నికలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నుంచి 90 మంది సీనియర్‌ క్రీడాకారులు, వ్యాయామ విద్య ఉపాధ్యాయులు పాల్గొన్నట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఖోఖో సంఘం ప్రతినిధిగా వేల్పుల కుమార్‌, ఎన్నికల అధికారిగా పవన్‌కుమార్‌రెడ్డి, రైల్వేటీం ఖోఖో శిక్షకుడు నరేశ్‌ పాల్గొన్ని కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఉమ్మడి జిల్లా ఖోఖో సంఘం అధ్యక్షుడిగా ఒబేదుల్లా కొత్వాల్‌, ప్రధాన కార్యదర్శిగా జీఏ విలియం, కోశాధికారిగా మధుకుమార్‌, ఉపాధ్యక్షులుగా శ్రీనివాసులు, నిరంజన్‌యాదవ్‌, సహాయ కార్యదర్శులుగా రమేష్‌కుమార్‌, నిరంజన్‌, సంయుక్త కార్యదర్శులుగా మొగులాల్‌, వెంకటేశ్వర్లు, కార్య నిర్వాహక కార్యదర్శిగా బాలరాజు ఎంపికయ్యారు.

వైభవంగా పూర్ణాహుతి

మహబూబ్‌నగర్‌ రూరల్‌: మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానంలో ఆదివారం పూర్ణాహుతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రావణమాస విశేషోత్సవాలు ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో నెల రోజులపాటు దేవస్థానంలో పలు పూజలతోపాటు ప్రతిరోజు ప్రత్యేక శాంతిహోమం, ప్రత్యేక దినోత్సవాల రోజుల్లో స్వామివారికి వివిధ పూజలు నిర్వహించారు. విశేషోత్సవాల సందర్భంగా స్వామివారిని బంగారు ఆభరణాలతో స్వర్ణాభరణ అలంకరణ చేసి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. వేయి తులసి దళాలతో ప్రత్యేక అర్చన పూజ (తులసి నామార్చన) జరిపారు. ముగింపు వేడుకల సందర్భంగా హనుమద్దాసుల మండపంలో స్వామివారికి పలు పూజలు నిర్వహించారు. నెలరోజులపాటు జరిగిన ప్రత్యేక వేడుకలకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు మన్యంకొండకు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్‌ అళహరి మధుసూదన్‌కుమార్‌, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్‌ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.

మైసమ్మ ఆలయం  పరిశీలన  
1
1/2

మైసమ్మ ఆలయం పరిశీలన

మైసమ్మ ఆలయం  పరిశీలన  
2
2/2

మైసమ్మ ఆలయం పరిశీలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement