ధనుర్మాసం ప్రత్యేక పూజలు | - | Sakshi
Sakshi News home page

ధనుర్మాసం ప్రత్యేక పూజలు

Dec 21 2025 12:41 PM | Updated on Dec 21 2025 12:41 PM

ధనుర్మాసం ప్రత్యేక పూజలు

ధనుర్మాసం ప్రత్యేక పూజలు

గణపురం: మండలకేంద్రంలోని శ్రీపట్టాభి సీతారామచంద్ర స్వామి ఆలయంలో నెల రోజుల పాటు నిర్వహించే ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా 5వ రోజు శనివారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాకతీయుల కాలం నాటి పురాతన ఆలయమైన శ్రీ పట్టాభి సీతారామచంద్ర భరత, శత్రుఘ్న, హనుమత్‌ సమేత ఆలయంలో ప్రతీ సంవత్సరం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు ముసునూరి నరేష్‌ తెలిపారు. అందులో భాగంగా స్వామి వారిన ప్రత్యేకంగా అలంకరించినట్లు చెప్పారు. ఈ నెల 30న ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement