
వినతులిచ్చాం.. పరిష్కరించండి
పింఛన్ ఇప్పించండి..
ఐదు సంవత్సరాల క్రితం పెరాలసిస్తో కాలు, చేయి పడిపోయింది. అప్పటి నుంచి భార్య కూలీ పనులు చేసి సాదుతుంది. పింఛన్ కోసం ఐదు సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నా పింఛన్ రావడం లేదు. అధికారులు స్పందించి పింఛన్ మంజూరు చేయాలి.
– సమ్మయ్య, సర్వాపూర్, ములుగు మండలం
నిరుపేదలకు ఇచ్చిన స్థలాల్లో
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించొద్దు
ములుగు మండలం మదనపల్లి గ్రామంలో 49 నిరుపేద కుటుంబాలకు గత ప్రభుత్వ హయాంలో ఇంటి స్థలం 75 గజాల చొప్పున కేటాయించి పట్టాలు అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ఇంటి పట్టాలను రద్దు చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు కేటాయిస్తుందని తెలుస్తుంది. నిరుపేదలకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయొద్దు.
– పసుల ప్రభాకర్, మదనపల్లి
గిరిజన మహిళల సమస్యలు తెలుసుకుంటున్న పీఓ చిత్రామిశ్రా
గ్రీవెన్స్లో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ దివాకర
●
పోడు పట్టాలు ఇవ్వాలి
ఏటూరునాగారం మండలంలోని ఆకులవారిఘణపురం పరిధిలో ఉన్న రైతులు 2006 నుంచి పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. వారికి పోడు పట్టాలు ఇవ్వాలి. ప్రభుత్వాలు మారుతున్నా పోడు పట్టాలు మాత్రం రావడం లేదు. రెవెన్యూ, ఐటీడీఏ, ఫారెస్ట్ అధికారులు సంయుక్తంగా సర్వేలు చేసి తమకు హక్కు పత్రాలు ఇవ్వాలని 15 మంది రైతులతో కలిసి వినతి పత్రాన్ని అందజేశాం.
– ఆలం రమేష్, రైతు, ఏటూరునాగారం
ప్రజావాణిలో వచ్చిన వినతుల వివరాలు..
భూ సమస్యలు 23
గృహ నిర్మాణశాఖ 15
ఉపాధి కల్పన 01
పింఛన్లు 02
ఇతర సమస్యలు 15

వినతులిచ్చాం.. పరిష్కరించండి

వినతులిచ్చాం.. పరిష్కరించండి

వినతులిచ్చాం.. పరిష్కరించండి

వినతులిచ్చాం.. పరిష్కరించండి