
పొగాకు ఉత్పత్తులు విక్రయించొద్దు
ములుగు రూరల్: విద్యా సంస్థల పరిధిలో 100 గజాల వరకు పొగాకు ఉత్పత్తులు సిగరేట్, గుట్కా, తంబాకు వంటివి విక్రయించొద్దని ఎస్పీ శబరీశ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సిగరేట్లు, పొగాకు ఉత్పత్తుల చట్టం–2003, జువైనెల్ జస్టిస్ యాక్ట్–2015 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చే దిశగా యువత, ప్రజలు పాటుపడాలని సూచించారు.
సీఎంతో ముఖాముఖిలో పాల్గొనాలి
ములుగు రూరల్: రైతు భరోసా లబ్ధిదారులతో సీఎం రేవంత్రెడ్డితో నేడు(మంగళవారం) ముఖాముఖి చర్చ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి సురేష్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు కార్యక్రమం ఉంటుందని వివరించారు. రైతులు అందుబాటులో ఉన్న రైతు వేదికల్లో సీఎంతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.
‘ఇందిరమ్మ ఇళ్లలోనే
ఉంటున్నారు’
వాజేడు: గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లల్లోనే దివ్యాంగులు ఉంటున్నట్లు ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీకాంత్ నాయుడు తెలిపారు. మండల పరిధిలోని చీకుపల్లి గ్రామనికి చెందిన ముగ్గురు దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరూ.. శీర్షికతో సోమవారం సాక్షిలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఆయన దివ్యాంగులు పొడెం విజయ తమ తండ్రికి వచ్చిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటుండగా, గొంది పాపారావు, గొంది సుజాతలు తమ సోదరులకు వచ్చిన ఇందిరమ్మ ఇళ్లల్లోనే వారితోనే కలిసి ఉంటున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు సర్వే సమయంలోనూ వివరాలను సేకరించినట్లు తెలిపారు. ఆ ముగ్గురు దివ్యాంగులకు పెళ్లిళ్లు కాలేదని వారు ఒంటరి వారని వివరించారు.
మావోయిస్టులకు
సహకరించొద్దు
పలిమెల: మావోయిస్టులకు ఎవరూ సహకరించవద్దని పలిమెల ఎస్సై రమేష్ సూచించారు. మండలంలోని అయా గ్రామాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న వరుస ఎన్కౌంటర్లు, అరెస్టులతో తీవ్రంగా నష్టపోయిన సీపీఐ (మావోయిస్టు) దళాలు జిల్లాలోకి వచ్చే అవకాశం ఉందన్నారు. మావోయిస్టు సాయుధ దళాలు, దళ సభ్యులు, అనుమానితులు, అపరిచిత వ్యక్తులు ఎవరైనా ఆదివాసీ గుంపుల దగ్గరలో సంచరించినట్లయితే వెంటనే డయల్ 100 ఫోన్ చేసి సమాచారం ఇచ్చి తగిన పారితోషకం పొందాలని పేర్కొన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. మావోయిస్టులకు సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఘనంగా ఒలింపిక్ డే
భూపాలపల్లి అర్బన్: ఒలింపిక్ డేను పురస్కరించుకొని జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లాకేంద్రంలో రన్ కార్యక్రమానికి ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని జయశంకర్ విగ్రహం నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు హాజరై ఒలింపిక్ టార్చ్తో రన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరేష్కుమార్, డీడబ్ల్యూఓ మల్లీశ్వరి, డీపీఓ వీరభద్రయ్య, బీసీ వెల్ఫేర్ అధికారి క్రాంతికిరణ్, సీఐ నరేష్, ఎస్ఐ సాంబమూర్తి, క్రీడాసంఘాల ప్రతినిధులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పొగాకు ఉత్పత్తులు విక్రయించొద్దు

పొగాకు ఉత్పత్తులు విక్రయించొద్దు