గ్రీవెన్స్‌కు 56, గిరిజన దర్బార్‌కు 27 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

గ్రీవెన్స్‌కు 56, గిరిజన దర్బార్‌కు 27 అర్జీలు

Jun 24 2025 3:53 AM | Updated on Jun 24 2025 3:53 AM

గ్రీవెన్స్‌కు 56, గిరిజన దర్బార్‌కు 27 అర్జీలు

గ్రీవెన్స్‌కు 56, గిరిజన దర్బార్‌కు 27 అర్జీలు

ములుగురూరల్‌/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరు తూ వివిధ సమస్యలపై 83 దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో కలెక్టర్‌ టీఎస్‌.దివాకర, ఐటీడీఏలో పీఓ చిత్రామిశ్రా వినతులు స్వీకరించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో 56 ఫిర్యాదులు రాగా ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 27 వినతులు వచ్చాయి. వాటిని పరిశీలించిన అధికారులు ఆ యా శాఖల అధికారులకు సిఫారసు చేశారు. పరిశీ లించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

గిరిజన దర్బార్‌కు వచ్చిన వినతులు

కన్నాయిగూడెం మండలం కంతనపల్లి సీఎంఏ 2013లో వచ్చిన జడ్జిమెంట్‌ కాపీని సర్టిఫై చేసి ఇవ్వాలని కోరారు. గోవిందరావుపేట మండలం మొద్దలగూడెం గ్రామానికి చెందిన ఓ గిరిజనుడు ఏజెన్సీ సర్టిఫికెట్‌ కావాలని కోరారు. కన్నాయిగూడెం మండలం కంతనపల్లిలో భూ భారతి సదస్సు నిర్వహించి రైతుల సమస్యలను పరిష్కరించాలని గిరిజనులు పీఓకు విన్నవించారు. మహబూబాబాద్‌ మండలం గంగారం గ్రామానికి చెందిన ఓ నిరుద్యోగుడు ఉద్యోగం ఇప్పించాలని పీఓను కోరారు. పోడు పట్టాలు ఇప్పించాలని గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన గిరిజనులు కోరారు. ఏటూరునాగారం మండలం ఆకులవారిఘణపురం ప్రాంతంలో ఉన్న గిరిజనులు 2006 నుంచి పోడు చేసుకుంటున్నామని, తమకు పట్టాలు ఇప్పించాలని కోరారు. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు వచ్చే భక్తులకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షల నుంచి మినహాయింపు ఇవ్వాలని పలువురు కోరారు. ఏటూరునాగారం మండలం వీరాపురం ప్రాంతానికి చెందిన నిరుద్యోగురాలు ఉద్యోగ అవకాశం ఇప్పించాలని కోరారు. ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలం కామారంలోని హర్టికల్చర్‌ భూములకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు పీఓను కోరారు. కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లికి చెందిన గిరిజనుడు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలో భూమి బోరు నిర్మించుటకు అనుమతి ఇవ్వాలని పీఓకు మొరపెట్టుకున్నారు. మహాముత్తారం గ్రామంలోని నల్లగుంట, మీనాజీపేట గ్రామస్తులు గిరివికాసం పథకాలు అందడం లేదని పీఓకు విన్నవించారు.

ప్రజావాణిలో వచ్చిన వినతుల వివరాలు..

భూ సమస్యలు 23

గృహ నిర్మాణశాఖ 15

ఉపాధి కల్పన 01

పింఛన్లు 02

ఇతర సమస్యలు 15

స్వీకరించిన కలెక్టర్‌ దివాకర,

ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా

పరిశీలించి సత్వరమే

పరిష్కరించాలని ఆదేశాలు

ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా భూమి ఆన్‌లైన్‌ చేయాలి

3.30 ఎకరాల ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టా భూమి ఆన్‌లైన్‌లో లేదు. దీంతో బ్యాంక్‌లు క్రాప్‌ లోన్లు ఇవ్వడం లేదు. పెట్టుబడి లేకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు ఇలాంటి వాటిపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టి ఆన్‌లైన్‌ చేయాలి.

– కాపుల సమ్మయ్య,

రైతు, అల్లంవారిఘణపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement