పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

Jun 24 2025 3:53 AM | Updated on Jun 24 2025 3:53 AM

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి

కాటారం: పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి అన్నారు. నషాముక్త్త్‌ భారత్‌ వారం రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలకేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఫ్లాంటేషన్‌ డ్రైవ్‌ నిర్వహించారు. జిల్లా సంక్షేమ శాఖ సిబ్బంది, విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో సామూహికంగా మొక్కలు నాటారు. నషాముక్త్‌ భారత్‌ లక్ష్యాలపై సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ విద్యార్థులు మత్తుపదార్థాల వినియోగానికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలతో కలిగే దుష్పరిణామాలపై వివరించారు. ప్రతీఒక్కరు మొక్కలు నాటి ప్రకృతి పరిరక్షణకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ రాధిక, కేజీబీవీ ప్రిన్సిపల్‌ చల్ల సునీత, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

జిల్లా సంక్షేమాధికారి మల్లేశ్వరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement