
ప్రజలకు మెరుగైన వైద్యసేవలు
వెంకటాపురం(ఎం): జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు జాతీయ క్వాలిటీ సర్టిఫికెట్ పొందడంతో ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని డీఎంహెచ్ఓ గోపాల్రావు పేర్కొన్నారు. మండల పరిధిలోని నల్లగుంట ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ను ఆయన సోమవారం సందర్శించారు. రిజిస్టర్, మందుల నిల్వలు, ఐఈసీ మెటీరియల్, మందిర్ ప్రాంతంలో నాటిన హెర్బల్ మొక్కలను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడారు. జిల్లాలో 9 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో క్వాలిటీ కంట్రోల్ వర్చువల్ అసెస్మెంట్ కార్యక్రమాలు నిర్వహించగా 7 కేంద్రాలు క్వాలిటీ సర్టిఫికెట్ సాధించాయన్నారు. మిగిలిన రెండు కేంద్రాలు సైతం క్వాలిటీ సర్టిఫికెట్లు పొందేలా చూడాలని సిబ్బందికి సూచించారు. వర్షాకాలంలో మలేరియా, డెంగీ, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలకుండా వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో నీటినిల్వలు లేకుండా చూడాలని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. వారంలో ఒక ఇంటిని రెండుసార్లు సందర్శించాలన్నారు. జ్వరం వచ్చిన ప్రతీ వ్యక్తికి పరీక్షలు నిర్వహించి మందులు అందించాలని సూచించారు. అవసరమైన గ్రామాలలో వైద్యశిబిరాలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి శ్రీకాంత్, వ్యాధి నిరోధక టీకాల జిల్లా ప్రోగ్రాం అధికారి రణధీర్, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కేంద్రాల వైద్యులు పార్వతి, అనిత, సంఘమిత్ర, శ్రీనివాస్, డెమో సంపత్, సీహెచ్ఓ సంపత్రావు, డీపీఎం సంజీవరావు, సాంబయ్య, క్వాలిటీ మేనేజర్ శరత్, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
డీఎంహెచ్ఓ గోపాల్రావు

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు