
లేబర్ కోడ్లు రద్దు చేయాలి
ములుగు రూరల్: లేబర్ కోడ్లను రద్దు చేయాలని జాతీయ, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపులో భాగంగా వచ్చే నెల 9న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొననున్నట్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి రత్నం రాజేందర్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆశ కార్యకర్తలతో కలిసి కలెక్టర్ టీఎస్.దివాకర, పంచాయతీ కార్మికులతో కలిసి డీపీఓ దేవరాజుకు వినతిపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు పోరాటాలతో సాధించుకున్న కార్మిక చట్టాల స్థానంలో తీసుకొచ్చి న లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేబర్ కోడ్లతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉండవని తెలిపారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని వివరించారు. ఐసీడీఎస్ లాంటి కేంద్ర ప్రభుత్వ స్కీములను ప్రభుత్వ శాఖలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింహచారి, నీలాదేవి, చంచు మంజూల, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాజేందర్