
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి
వెంకటాపురం(కె): విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సూచించారు. మండల పరిధిలోని చిరుతపల్లి బాలికల ఆశ్రమ పాఠశాలలో అభయ మిత్ర కార్యక్రమంపై విద్యార్థులకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ను తరిమి కోడదాం, యువతను కాపాడుకుందామని వివరించారు. విద్యార్థులకు డ్రగ్స్పై, పొక్సో చట్టంపై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సీఐ బండారి కుమార్, ఎస్సై కొప్పుల తిరుపతి రావు, ట్రైనీ ఎస్సై తిరుపతి రెడ్డి. మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ, ఉపాధ్యాయులు బాబురావు తదితరులు పాల్గొన్నారు.
ఏఎస్పీ శివం ఉపాధ్యాయ