
పంట రుణాలను రెన్యూవల్ చేయాలి
ములుగు రూరల్: రైతులు తీసుకున్న పంట రుణాలను రెన్యూవల్ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి. అమ్జద్పాషా అన్నారు. ఈ మేరకు సోమవారం జంగాలపల్లి యూనియన్ బ్యాంక్ వద్ద రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. అనంతరం బ్యాంక్ మేనేజర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేయాలన్నారు. జిల్లాలో 30 శాతం మంది రైతులకు మాత్రమే పట్టాలు ఉన్నాయన్నారు. గతంలో మాదిరిగా పహాణీ నకల్ ఆధారంగా రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంకిడి కృష్ణయ్య, భిక్షపతి, ఐలయ్య, అబ్ధుల్, నబి, శాంతమ్మ, నారాయణ, లక్ష్మీ, రైతులు పాల్గొన్నారు.
రైతుసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి
అమ్జద్పాషా