
ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరూ..!
వాజేడు: వారంతా దివ్యాంగులు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అర్హుల జాబితాలో వారి పేర్లు ఉన్నాయి. కాని మంజూరు లీస్టులో పేర్లు లేకపోవడంతో వారికి ఇందిరమ్మ ఇళ్లు రాలేదు. తమకు కూడా ఇళ్లు ఇప్పించాలని పలువురు దివ్యాంగులు వేడుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని చీకుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు గొంది సుజాత. ఇల్లు లేకపోవడంతో కోడళ్ల వద్ద ఉంటూ కాలం వెళ్లదీస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల అర్హుల జాబితాలో పేరు వచ్చినప్పటికీ ఈమెకు మంజూరు పత్రం రాలేదు. అధికారులు స్పందించి తన సమస్య పరిష్కరించాలని వేడుకుంటోంది. చీకుపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగుడు గొంది పాపారావు. మూడు చక్రాల సైకిల్పై తిరుగుతుంటాడు. ఇతని పేరు అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ ఇళ్లు మాత్రం రాలేదు. అదే గ్రామానికి చెందిన పొడెమ విజయలక్ష్మి పుట్టు మూగ, ఒంటరి మహిళ. అర్హుల జాబితాలో పేరు ఉన్నా ఇళ్లు మంజూరు చేయలేదని సైగలతో ఆరోపిస్తుంది. తక్షణమే ఉన్నతాధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు స్పందించి ఇళ్లు మంజూరు చేయాలని బాధిత దివ్యాంగులు కోరుతున్నారు.
దివ్యాంగుల వేడుకోలు

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరూ..!

ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయరూ..!