
రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్గా ఉందని 16 దేశాలకు చెందిన 49 మంది విదేశీ అధికారులు కొనియాడారు. హైదరాబాద్లోని మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, కెన్యా, ఉగాండా, కజకిస్తాన్, సుడాన్, ఇథియోఫియా, చీలీ, టూనిషియా, సెర్రిలియాన్ తదితర దేశాలకు చెందిన 49మంది అధికారులు శిక్షణలో భాగంగా రామప్ప ఆలయాన్ని శనివారం సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరున్ని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని వారు కొనియాడారు. అదే విధంగా రామప్ప ఆలయాన్ని వరంగల్ రీజియన్ సీఐడీ ఎస్పీ నవీన్కుమార్ సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్ కుమార్ వివరించారు. కార్యక్రమంలో ఎంసీహెచ్ఆర్డీఐటీ అధికారులు నంద కిశోర్, రవి, సతీష్, సీఐడీ డీఎస్పీ జితేందర్, సీఐలు, ఎస్సై చల్లా రాజు పాల్గొన్నారు.
విదేశీ అధికారుల ప్రశంస

రామప్ప టెంపుల్ బ్యూటిఫుల్