పౌష్టికాహారంతోనే ఎదుగుదల | - | Sakshi
Sakshi News home page

పౌష్టికాహారంతోనే ఎదుగుదల

Jun 22 2025 3:22 AM | Updated on Jun 22 2025 3:22 AM

పౌష్ట

పౌష్టికాహారంతోనే ఎదుగుదల

ములుగు రూరల్‌: పౌష్టికాహారంతోనే బాలల ఎదుగుదల సాధ్యమని జిల్లా సీనియర్‌ సివిల్‌ జడ్జి కన్నయ్యలాల్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని బాలసదనం–బాలికల వసతి గృహాన్ని ఆయన శనివారం సందర్శించారు. వసతి గృహంలో విద్యార్థినులకు అందుతున్న భోజన వసతిపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వసతి గృహాలలో పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. నేటి బాలలే రేపటి పౌరులని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ సూపరింటెండెంట్‌ రఘు, ఓంకార్‌, కృష్ణవేణి, శ్యామల, అరుణ తదితరులు పాల్గొన్నారు.

జయశంకర్‌ సార్‌కు

ఘన నివాళి

ములుగు రూరల్‌: మలిదశ తెలంగాణ ఉద్యమసారధి ప్రొఫెసర్‌ కొత్తపల్లి జయశంకర్‌ సార్‌ వర్ధంతి వేడుకలను జిల్లాకేంద్రంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు శనివారం జయశంకర్‌ సార్‌ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజానికం జయశంకర్‌ సార్‌ ఆశయాలను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు చాంద్‌ పాషా, వంగ రవియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

హేమాచలక్షేత్రంలో

‘బెల్లంకొండ’ కుటుంబీకులు

మంగపేట: మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్‌ పద్మ దంపతులు, కుమారులు సినీ హీరో సాయి శ్రీనివాస్‌, గణేశ్‌ బాబుతో కలిసి శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మొదటి సారిగా ఆలయానికి వచ్చిన వారు ఆలయంలో నిర్వహించిన స్వామివారి తిలతైలాభిషేకం పూజలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు, పూలు పండ్లు సమర్పించారు. ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అర్చకులు బెల్లంకొండ కుటుంబ సభ్యులను స్వామివారి గర్భాలయంలోకి ఆహ్వానించి స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించారు. అనంతరం వారికి స్వామివారి శేష వస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సినీ నిర్మాత, సినీ హీరో సాయి శ్రీనివాస్‌ను చూసేందుకు వందలాది మంది భక్తులు పోటీ పడ్డారు. కొందరు వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పవన్‌కుమార్‌, రాజీవ్‌ శర్మ, ఆలయ రికార్డు అసిస్టెంట్‌ గోనె లక్ష్మినారాయణ, సిబ్బంది శివరాజు శేషు, నూతలకంటి అజయ్‌, నవీన్‌, గొర్లపెల్లి గణేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

పౌష్టికాహారంతోనే ఎదుగుదల 
1
1/1

పౌష్టికాహారంతోనే ఎదుగుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement