
మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలి
ములుగు రూరల్: మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలని అదనపు కలెక్టర్ మహేందర్జీ అన్నారు. ఈ మేరకు శనివారం తన కార్యాలయంలో మాదక ద్రవ్యాల నియంత్రణ వాల్ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. సమాజానికి పెను సవాలుగా మారిన మత్తు పదార్థాల నివారణకు సంబంధిత శాఖ అధికారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. రాష్ట్ర సరిహద్దుల నుంచి రవాణా చేసే అవకాశాలు ఉన్నందున కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. తనిఖీ కేంద్రం వద్ద నిఘా పెంచాలని ఆదేశించారు. మాదక ద్రవ్యాల రవాణాపై సమాచారం అందించడానికి టోల్ ఫ్రీ నంబర్ 1908కు సమాచారం అందించాలని తెలిపారు. అనంతరం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒలంపిక్ డేను పురస్కరించుకుని ఒలంపిక్ రన్ జ్యోతిని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే బంగారు భవిష్యత్ ఉంటుందని వివరించారు. విద్యార్థులు క్రీడల్లో రాణించి ఒలంపిక్ స్థాయికి ఎదగాలని సూచించారు.
డ్రగ్స్నిర్మూలనలో భాగస్వాములు కావాలి
ఎస్ఎస్తాడ్వాయి: డ్రగ్స్ నిర్మూలనలో యువత భాగస్వాములు కావాలని ఎస్పీ శబరీశ్ కోరారు. తాడ్వాయి పోలీసుల ఆధ్వర్యంలో ప్రజల భద్రత భరోసాకు అభయ మిత్ర కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో భాగంగా యువతను భాగస్వాములను చేస్తూ మండల స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. రోడ్డు సేఫ్టీ కమిటీల ద్వారా రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ బాధ్యతగా హెల్మెట్ ధరించాలని సూచించారు.వాలీబాల్ పోటీల్లో విన్నర్గా కామారం జట్టు, రన్నర్గా గంగారం జట్టు విజయం సాధించగా ఎస్పీ షీల్డ్లు అందజేశారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్, సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్జీ

మాదక ద్రవ్యాల రవాణాను నియంత్రించాలి