
యోగాతో మానసిక ప్రశాంతత
ములుగు రూరల్/గోవిందరావుపేట: యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని కలెక్టర్ టీఎస్.దివాకర అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రసుత్త సమాజంలో ప్రజలు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందేందుకు యోగా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. అదే విధంగా గోవిందరావుపేట మండల పరిధిలోని చల్వాయి టీజీఎస్పీ 5వ బెటాలియన్లో కమాండెంట్ కె.సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ యోగాతో శారీరక, మానసికోల్లాసం కలుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, తహసీల్దార్ విజయ్భాస్కర్, డీఎంహెచ్ఓ గోపాల్రావు, బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్.దివాకర
– మరిన్ని ఫొటోలు 9లోu

యోగాతో మానసిక ప్రశాంతత