
మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలి
కాటారం: నర్సరీల్లో మొక్కల పెంపకం పట్ల తగు జాగ్రత్తలు పాటించి సక్రమంగా ఎదిగేలా చర్యలు తీసుకోవాలని అటవీశాఖ మహదేవపూర్ డివిజన్ అధికారి సందీప్రెడ్డి సూచించారు. కాటారం మండలకేంద్రంలోని సెంట్రల్ నర్సరీని శుక్రవారం ఆయన పరిశీలించారు. మొక్కల పెంపకం, మొక్కల రకాలు తదితర అంశాలపై ఎఫ్డీఓ ఆరాతీశారు. మొక్కల పెంపకం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం గుమ్మాళ్లపల్లి అటవీ ప్రాంతంలో కలియ తిరిగి అటవీ అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. జిల్లాలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నందున అటవీశాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ఎఫ్డీఓ వెంట కాటారం రేంజ్ అధికారి స్వాతి, డిప్యూటీ రేంజ్ అధికారి సురేందర్, బీట్ అధికారులు రాజేందర్, రాజ్కుమార్ ఉన్నారు.
ఎఫ్డీఓ సందీప్రెడ్డి