
విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు
సంతోషంగా ఉంది
కేజీబీవీ బాలికల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నూతన మెనూ అమలు చేయడం సంతోషంగా ఉంది. మెస్ చార్జీలు కూడా పెంచడంతో మాకు ఎంతో ఉపశమనం కలుగుతుంది.
– పలిశెట్టి ప్రసన్న, 10వ తరగతి, కేజీబీవీ జవహర్నగర్
ప్రభుత్వానికి
కృతజ్ఞతలు
గతానికి భిన్నంగా సీఎం రేవంత్రెడ్డి నూతన మెనూ అమలు చేయడం సంతోషంగా ఉంది. మంచి పోషకాహారం అందడంతో చదువుపై మరింత దృష్టి సారిస్తాం. రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– బండారి సింధూ,
9వ తరగతి, కేజీబీవీ జవహర్నగర్
నూతన మెనూ ప్రకారమే..
ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి నూతన మెనూ అమలు చేస్తున్నాం. నూతన మెనూ చార్టులు పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాం. బాలికలకు పౌష్టికాహారం అందడంతో ఆరోగ్యంగా ఉండడమే కాకుండా చదువులో మరింత రాణించే అవకాశం ఉంటుంది.
– జయ వసంతలక్ష్మి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్
వెంకటాపురం(ఎం): నిరుపేద బాలికలు చదువును మధ్యలో ఆపేయకుండా కేంద్రప్రభుత్వం 2004–05లో కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాలను (కేజీబీవీ) ప్రారంభించింది. ప్రతీ మండలంలో కేజీబీవీలను నెలకొల్పి హాస్టల్ వసతితో పాటు బాలికలు ఉన్నత చదువులు చదువుకునేలా ప్రోత్సహిస్తుంది. నిరుపేద బాలికలను అక్కున చేర్చుకుని వారి ఆలనాపాలనా చూసుకుంటూ నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. రాష్ట్రంలోని కేజీబీవీల బలోపేతానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. కేజీబీవీ విద్యార్థినులు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నట్లు ఇటీవల చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో కేజీబీవీ బాలికల పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న బాలికలకు పౌష్టికాహారం అందించి వారి అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గతంలో ఉన్న మెనూలో పలు మార్పులు చేసింది. 2025–26 విద్యా సంవత్సరంలో నూతన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందిస్తున్నారు.
పెరిగిన మెస్ చార్జీలు
గతంలో 6 నుంచి 10వ తరగతితో పాటు ఇంటర్ విద్యార్థులందరికీ ఒకే విధంగా నెలకు రూ.1,225 లను ప్రభుత్వం అందించేది. కానీ నూతన మెనూ ప్రకారం 6 నుంచి 7వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,330లు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.1,540లు, ఇంటర్ విద్యార్థులకు నెలకు రూ.2,100లను ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా 9 కేజీబీవీలు ఉండగా వాటిలో 1,933 మంది విద్య నభ్యసిస్తున్నారు. మెస్ చార్జీలను ప్రభుత్వం పెంచడంతో కేజీబీవీ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
నెలకు రూ.1,225 నుంచి రూ.1,540లకు పెంపు
జిల్లా వ్యాప్తంగా 9 విద్యాలయాల్లో 1,933 మంది విద్యార్థినులు
మెస్చార్జీలు పెరుగుదలతో ఆనందం

విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు

విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు

విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు

విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు

విద్యార్థినులకు పౌష్టికాహారం అందించేందుకు చర్యలు