ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

Jun 21 2025 3:02 AM | Updated on Jun 21 2025 3:02 AM

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి

ములుగు రూరల్‌: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులదారులతో సిబ్బంది మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని ఎస్పీ శబరీష్‌ అన్నారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఫిర్యాదులు వచ్చిన వెంటనే విచారణ అధికారికి అందించి విచారణ అనంతరం కేసులు నమోదు చేయాలన్నారు. రికార్డులు పెండింగ్‌ లేకుండా చూసుకోవాలని, విచారణ చేపడుతున్న కేసుల్లో ప్లాన్‌, యాక్షన్‌ కలిగి ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, మాదకద్రవ్యాల నిర్మూలనకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సైబర్‌ నేరాల బారిన ప్రజలు పడకుండా అప్రమత్తం చేయాలన్నారు. డీఎస్పీ రవీందర్‌, ఎస్‌బీ సీఐ శంకర్‌, సీఐ సురేష్‌, ఎస్‌హెచ్‌ఓ వెంకటేశ్వర్‌రావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ శబరీష్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement