
విద్యార్థులు వచ్చినప్పుడే ప్రార్థన..
వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని లింగాపూర్ పాఠశాలలో 21 మంది విద్యార్థులకు ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. విద్యార్థులు వచ్చినప్పుడే పాఠశాలలో ప్రార్థన చేస్తున్నారు. అలాగే జవహర్నగర్ కేజీబీవిలో 370 మంది విద్యార్థులకు 43 మంది మాత్రమే హాజరయ్యారు. ఇక్కడ ఉపాధ్యాయినులు సమయపాలన పాటించకపోవడంతో పాటు వాట్సాప్ మేసేజ్్ ల ద్వారానే సెలవులు పెడుతున్నట్లు తెలిసింది. కేజీబీవీలో హాస్టల్ వసతులు సరిగా లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారు. నూతనంగా నిర్మిస్తున్న 15 గదుల భవనాన్ని స్వాధీనం చేస్తే బాలికల సమస్యలు పరిష్కారం కానున్నాయి.