
ఊరట్టం పాఠశాలలో తాగునీరు కరువు
ఎస్ఎస్తాడ్వాయి మండల పరిధిలోని ఊరట్టంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో విద్యార్థులకు తాగునీరు కరువైంది. అమ్మ ఆదర్శ పాఠశాల కింద ప్రభుత్వం ఎంపిక చేసి పాఠశాలలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, తాగునీటి కోసం ప్యూరిఫైయర్ వాటర్ మిషన్ ఏర్పాటు చేశారు. విద్యుత్ సౌకర్యం కల్పించారు. కానీ తాగునీటి వసతి మాత్రం లేదు. అమ్మ ఆదర్శ పాఠశాలకు మిషన్ భగీరథ నీటి కనెక్షన్ ఇవ్వాల్సి ఉండగా సంబంధిత అధికారులు ఇవ్వలేదు. విద్యార్థులు ఇంటి వద్ద నుంచే వాటర్ బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుని తాగుతున్నారు. మరుగుదొడ్లకు నీటి సరఫరా లేకపోవడంతో వినియోగించని పరిస్థితి.