ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువు
మరుగుదొడ్డి.. వంట షెడ్డు అధ్వానం
ఏటూరునాగారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఉంది. గత ప్రభుత్వం ఈ పాఠశాలను మొట్టమొదటి ఇంగ్లిష్ మీడియం పాఠశాలగా అప్గ్రేడ్ చేసింది. ఈ పాఠశాలలో మూడు తరగతి గదులు ఉండడంతో విద్యార్థులను ఒకే గదిలో రెండు క్లాస్లను కూర్చోబెట్టి స్కూల్ నడుపుతున్నారు. ఒకే మరుగుదొడ్డి ఉంది. శిథిలమైన వంటషెడ్డు, అధ్వానంగా టాయిలెట్స్ ఉన్నాయి. అదే విధంగా పాఠశాల ఆవరణలోని భవనం పైకప్పు పూర్తిగా శిథిలమై ఉండడంతో వర్షాలు కురిస్తే గదిలో మొత్తం వర్షపు నీరే దర్శనమిస్తుంది. తరగతి గది సరిగా లేకపోవడంతో విద్యార్థులను వరండాలోనే కూర్చొబెట్టి పాఠాలను బోధిస్తున్నారు.
● తాగునీరు, మరుగుదొడ్లు లేని దుస్థితి
● పలుచోట్ల శిథిలావస్థలో భవనాలు
● విద్యార్థులు లేక
మూతపడుతున్న పాఠశాలలు
మూతబడి తెరుచుకున్నా ప్రయోజనం లేదు..
ఎస్ఎస్తాడ్వాయి మండల కేంద్రంలోని నర్సింగాపూర్లో ఎంపీపీఎస్ పాఠశాల గతేడాది విద్యార్థులు లేక మూతపడింది. విద్యార్థులు లేకపోవడంతో ఉపాధ్యాయుడు కీర్తిమంతరావును మండలంలోని బంజరఎల్లాపూర్ పాఠశాలకు విద్యాశాఖ అధికారులు డిప్యుటేషన్పై పంపించారు. ఈ ఏడాది బడిబాట కార్యక్రమంలో ముగ్గురు విద్యార్థులను గుర్తించి బడిలో చేర్పించారు. అయితే కొద్దిరోజులు మాత్రమే పాఠశాలకు వచ్చిన విద్యార్థులు బడి మానేశారు. ఉపాధ్యాయుడు కీర్తిమంతరావు మాత్రమే పాఠశాలకు వస్తున్నారు.
ములుగు రూరల్: ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. మౌలిక వసతులు సైతం కరువయ్యాయి. కొన్ని పాఠశాలల్లో భవనాలు శిథిలావస్థలకు చేరుకున్నాయి. మరికొన్ని చోట్ల విద్యార్థులు లేకపోవడంతో గతేడాది 54పాఠశాలలు మూతపడిన దుస్థితి నెలకొంది. అలాగే పలు పాఠశాలల్లో టాయిలెట్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు. తాగునీటి వసతి సైతం లేకపోవడంతో ఇంటి వద్ద నుంచి బాటిళ్లలో నీళ్లు తెచ్చుకుంటున్నారు. బడిబాట కార్యక్రమంలో పిల్లలను పాఠశాలల్లో చేర్పించిన వారిని సైతం బడికి వచ్చేలా చూసుకోవడం లేదు. ఇలా.. జిల్లాలోని ప్రతీ పాఠశాలను ఏదో ఒక సమస్య వేధిస్తున్నట్లు గురువారం ‘సాక్షి’ విజిట్లో వెల్లడయ్యింది.
సమస్యల బడి
సమస్యల బడి
సమస్యల బడి