
స్వయం సహకార సంఘాలకు శిక్షణ
ములుగు రూరల్: స్వయం సహకార సంఘాలకు రైజింగ్ అండ్ ఎక్సలెటరింగ్ ఆధ్వర్యంలో జీవనోపాధిపై శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలో మూడు మండలాలకు చెందిన 124 మంది సభ్యులకు హైదరాబాద్ లీప్ సంస్థ మేనేజర్ పల్లవి జోషి శిక్షణ అందించారు. ఈ సందర్భంగా పల్లవి మాట్లాడుతూ స్వయం సహకార సంఘం సభ్యులకు టైలర్స్, బట్టల వ్యాపారం, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ సంపత్రావు, సంస్థ మేనేజర్ ప్రియాంక, డీపీఎం వేణుగోపాల్, ఏపీఎం పాషా, తదితరులు పాల్గొన్నారు.
అట్రాసిటి కేసులు
నమోదు చేయాలి
ములుగు రూరల్: ఆదివాసీలపై దాడులకు పాల్పడి ఇళ్లు ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు నమోదు చేయాలని ఆదివాసీ నాయకపోడు సంఘం జిల్లా అధ్యక్షుడు కొత్త సురేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కోయగూడెంను సందర్శించి బాధితులను పరామర్శించారు. ఐదవ షెడ్యూల్డ్ ప్రకారం అటవి సంపదపై ఆదివాసీలకు హ క్కు ఉందన్నారు. ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయంపై అధికారులు విచారణ చేసి ఇంటి స్థలాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తుడెందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్కుమార్, గణేశ్, బాబు, మధుసుదన్, దేవేందర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ
పనులకు శంకుస్థాపనలు
గోవిందరావుపేట: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు మండల పరిధిలోని దుంపెల్లిగూడెంలో బుధవారం ములుగు జిల్లా కార్మిక శాఖ అధ్యక్షుడు కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటి నిర్మాణ పనులకు ముగ్గుపోయడంతో పాటు కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షుడు అశోక్ ఆదేశాల మేరకు గ్రామాల్లో అర్హులను గుర్తించి ఇళ్లు మంజూరు చేశామని తెలిపారు. లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల మేరకు గృహాలను నిర్మించుకోవాలని కోరారు. దశాబ్ద కాలంలో గత ప్ర భుత్వం ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేకపోయిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
భూపాలపల్లి రూరల్: మండలంలోని పలు గ్రామాల్లో విత్తనాలు, ఫర్టిలైజర్ షాపుల్లో డీఏఓ వీరునాయక్, ఏఓ సతీష్ తనిఖీలు చేపట్టారు. బుధవారం కొంపెల్లి, గుడాడ్పల్లి, గోర్లవీడు, వజినపల్లి, నేరేడుపల్లి గ్రామాల్లో షాపుల్లో రికార్డులను పరిశీలించారు. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు విక్రయించాలని, తప్పకుండా రశీదు ఇవ్వాలని, ప్రభుత్వ నిబంధనలు పాటించాలని యజమానులకు సూచించారు. తనిఖీల్లో వ్యవసాయశాఖ అధికారులు, కార్యాలయ సిబ్బంది ఉన్నారు.
226 క్వింటాళ్ల
రేషన్ బియ్యం పట్టివేత?
చిట్యాల: మండలంలోని కొత్తపేట శివారు మేఘన రైస్ మిల్లు వద్ద 266 క్వింటాళ్ల రేషన్ సన్న బియ్యం లారీని జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు, స్థానిక పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఈ మేరకు అందిన సమాచారంతో అధికారులు మిల్లు వద్ద వేచి చూసి దాడు లు నిర్వహించారు. దీంతో లారీలో ఉన్న సన్నబియ్యం స్థానిక పీఎస్కు తరలించారు. అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నారా..లేదా? అనేది నేడు నిర్థారణ కోసం బియ్యం నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపించారు. ఈ విషయంపై ఎస్సైని వివరణ కోరగా లారీని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

స్వయం సహకార సంఘాలకు శిక్షణ

స్వయం సహకార సంఘాలకు శిక్షణ