
డయేరియా నిర్మూలనకు చర్యలు
ఏటూరునాగారం: అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు డయేరియా ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, స్వయంగా ఓఆర్ఎస్ను తయారు చేసుకోవాలని ఐసీడీఎస్ సీడీపీఓ ప్రేమలత సిబ్బందికి సూచించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో స్టాప్ డయేరియా క్యాంపనింగ్ 2025 కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, సెర్ప్ సంఘాలతో అవగాహన కల్పించినట్లు తెలిపారు. జూన్ 16 నుంచి జూలై 31 వరకు ఈ కార్యక్రమాలు నిరంతరం చేపట్టాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలోని ఐదేళ్ల లోపు పిల్లలు డయేరియా బారిన పడకుండా ఉండేందుకు తగు జాగ్రత్తలను తీసుకోవాలన్నారు. అంగన్వాడీ టీచర్లకు సహాయ సహకారాలు అందించడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో పాటు మహిళా స్వయం సహాయక సంఘాలతో అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఓఆర్ఎస్, జింక్ తయారు చేసే విధానం, ఉపయోగించే పద్ధతులను టీచర్లకు వివరించామని తెలిపారు. ఈ వర్షాకాలంలో డయేరియా బారిన పడకుండా ఓఆర్ఎస్, జింక్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. డయేరియా ప్రబలితే సెంటర్ చుట్టూ శుభ్రం చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యురాలు సుమలత, డీఆర్డీఓ ఏపీడీ చౌహన్, సూపర్వైజర్లు, అంగన్వాడీలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు.
చట్టప్రకారం దత్తత తీసుకోవాలి
సంతానం లేని తల్లిదండ్రులు ఐసీడీఎస్, ఐసీపీఎస్ అధికారులు, సిబ్బందిని సంప్రదించి చట్ట ప్రకారం పిల్లలను దత్తత తీసుకోవాలని సీడీపీఓ ప్రేమలత సూచించారు. మండల కేంద్రంలోని ఐటీడీఏ కార్యాలయంలో బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో దత్తత విషయంపై అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. చట్టబద్ధమైన దత్తత తీసుకోవడం సంతోషకరమన్నారు.
సీడీపీఓ ప్రేమలత