వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం | - | Sakshi
Sakshi News home page

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

Jun 17 2025 4:57 AM | Updated on Jun 17 2025 4:57 AM

వ్యాయ

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

ములుగు రూరల్‌: వ్యాయామం చేస్తే ప్రజలు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలోని తోపుకుంట వద్ద రూ.5 లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ను మంత్రి ప్రారంభించి జిమ్‌ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రసుత్త సమాజంలో అన్నిటికంటే ఎంతో విలువైనది ఆరోగ్యమన్నారు. జిల్లాలో నిరుపేదలకు 6వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తున్నామని వివరించారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయాల కోసం ప్రజలను తప్పుతోవ పట్టిస్తూ పబ్బం గడుపుతున్నారని వివరించారు. పదేళ్లు అధికారంలో ఉండి నియోజకవర్గంలోని వెయ్యి ఇళ్లు ఇచ్చి సంగం కూడా పూర్తి చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్‌ ప్రభుత్వం విడతల వారీగా అర్హులైన ప్రతీ ఒక్కరికి అందిస్తామని వివరించారు. ప్రజలు అపోహలకు పోకూడదని తెలిపారు. సీఎం రేవంత్‌ రెడ్డి నిరుపేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని వివరించారు. ఇచ్చిన హామీ మేర కు ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రైతు భరోసా, బోనస్‌, మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలను అందిస్తుందని సీతక్క వివరించా రు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ టీఎస్‌.దివాకర, అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేదల కుటుంబాలకు భరోసా అని మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితులకు రూ. 15.22లక్షల సీఎం సహాయ నిధి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పేద ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కార్పోరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం పొందిన పేదలకు సీఎం సహాయనిధి కింద 70శాతం డబ్బులు అందిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ బానోత్‌ రవిచందర్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం1
1/1

వ్యాయామంతో సంపూర్ణ ఆరోగ్యం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement