డయేరియా మరణాలను అరికట్టాలి | - | Sakshi
Sakshi News home page

డయేరియా మరణాలను అరికట్టాలి

Jun 17 2025 4:57 AM | Updated on Jun 17 2025 4:57 AM

డయేరియా మరణాలను అరికట్టాలి

డయేరియా మరణాలను అరికట్టాలి

ములుగు రూరల్‌: డయేరియా మరణాలను అరికట్టాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ అధికారులకు సూచించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో సోమవారం స్టాప్‌ డయేరియా క్యాంపియన్‌ ఫోర్స్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో తాగునీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుందని గ్రామాలలో క్లోరినేషన్‌ చేసి నీటిని అందించాలన్నారు. డయేరియా నివారణకు గ్రామాలలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. వైద్య ఆరోగ్యశాఖ, స్తీ–శిశు సంక్షేమశాఖ, పంచాయతీరాజ్‌, విద్యాశాఖ, రూరల్‌ డెవలప్‌మెంట్‌, మిషన్‌ భగీరథ శాఖలు సమన్వయంగా పని చేయాలన్నారు. గ్రామాలలో 0–5 సంవత్సరాల పిల్లలు ఉన్న ఇళ్లకు ఓఆర్‌ఎస్‌, జింక్‌ ట్యాబ్లెట్లు అందించాలని తెలిపారు. విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రత కలిగి ఉండాలన్నారు. అనంతరం జిల్లా శిశు ఆరోగ్య, వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ రణధీర్‌ మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్‌, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ పూర్ణ సంపత్‌రావు, అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement