
అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఆరోపణలు
ఎస్ఎస్తాడ్వాయి: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, ప్రజల్లో పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేకనే ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి తండాల శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని నార్లాపూర్లో అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో పార్టీ నాయకులు, లబ్ధిదారులు కలిసి మంత్రి సీతక్క చిత్రపట్టానికి సోమవారం క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు కొంతమంది రాజకీయ లబ్ధికోసమే ఇళ్ల విషయంలో నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారన్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు ఎన్ని గ్రామాల్లో ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించారో ప్రజలకే తెలుసని వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఇప్ప నాగేశ్వర్రావు, గ్రామ కమిటీ అధ్యక్షుడు మొక్క శ్రీనివాస్, మండల యూత్ నాయకులు ఎనగంటి నరేష్, సంకే శ్రావణ్, బోప్ప వినోద్, సాయి కృష్ణ, రాపోలు సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.